ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే... | - | Sakshi
Sakshi News home page

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...

Jun 5 2025 8:20 AM | Updated on Jun 5 2025 8:20 AM

ప్రతీ

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...

బోనకల్‌/కొణిజర్ల: చెక్‌పోస్టు మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి అన్ని పత్రాలను పరిశీలించాలని అడిషినల్‌ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు బోనకల్‌ మండలంలోని జానకీపురం క్రాస్‌, కొణిజర్ల మండలం బస్వాపురం క్రాస్‌లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను బుధవా రం ఆయన పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తూ పశువుల రవాణాకు అనుమతిపత్రాలు లేని వాటిని అడ్డుకోవాలని తెలిపారు. ఇవి కాక ఇతర సంస్థల వాహనాలను ఆపొద్దని పేర్కొన్నారు. బోనకల్‌ ఎస్‌ఐ పొదిలి వెంకన్న, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు.

‘నో డ్రగ్స్‌.. సేవ్‌ లైఫ్‌’

అంటూ ప్రచారం

కామేపల్లి: మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత జీవితాలు కోల్పోకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ రద్దీ ఉండే జాతరలు, ఉత్సవాలు, వారాంతపు సంతల వద్దకు వెళ్లి మత్తు పదార్థాల వినియోగంతో నష్టంపై వివరిస్తున్నారు. కామేపల్లి మండలం పండితాపు రం వారాంతపు సంతకు బుధవారం ఆకట్టుకునేలా వేషధారణతో వచ్చిన ఆయన కరపత్రాలు, ఫ్లెక్సీ ద్వారా స్థానికులకు అవగాహన కల్పించారు.

రాష్ట్రస్థాయి

అథ్లెటిక్స్‌ మీట్‌లో సత్తా

ఖమ్మం స్పోర్ట్స్‌: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–10, 12 అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రాక్లీస్‌ చేస్తున్న డి.లోహిత, సీహెచ్‌.లాస్య అండర్‌–10 విభాగంలో, అండర్‌–12 బాలికల విభాగంలో ఎం.భవిత, బి.రుత్విక, బాలుర అండర్‌–12లో డి.ఉపేక్షిత్‌ ఈ.వరుణ్‌ బహుమతులు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, సీనియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌, అథ్లెటిక్స్‌ అసోసిఇయేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్‌ అహ్మద్‌ బుధవారం అభినందించారు.

యాసిడ్‌ తాగి

ఆత్మహత్యాయత్నం

ఖమ్మంక్రైం: ప్రియురాలు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె బంధువులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందిన వట్టికూడి సందీప్‌ జూబ్లీక్లబ్‌ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఆమె తల్లి నిరాకరించడంతో యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సందీపే కారణమని యువతిబంధువులు వేధిస్తున్నారంటూ సందీప్‌ బుధవారం యాసిడ్‌ తాగాడు. ఘటనపై ఆయన కుటుంబీకులు ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరంగా ర్యాలీ

మధిర: ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంపై త్రివిధ దళాలకు వందనం చెబుతూ మధిరలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా దేశ సైనికుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రంమలో డాక్టర్‌ ఏ.కొండలరావు, గల్లా సత్యనారాయణ, నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్‌.కే.మహమ్మద్‌ ముజాయిదీన్‌ మాట్లాడగా ఏలూరి నాగేశ్వరావు, చావా వేణు, చేకూరి కృష్ణారావు, రషీద్‌, గాలిమ్‌, కురువెళ్ల కృష్ణ, చెరుగుడ్ల నర్సింహారావు పాల్గొన్నారు.

ప్రతీ వాహనాన్ని  తనిఖీ చేయాల్సిందే...1
1/3

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...

ప్రతీ వాహనాన్ని  తనిఖీ చేయాల్సిందే...2
2/3

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...

ప్రతీ వాహనాన్ని  తనిఖీ చేయాల్సిందే...3
3/3

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement