
జేఎన్టీయూ నుంచి డాక్టరేట్
కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ పరిధి కిష్టయ్యబంజర్కు కావేటి రామకృష్ణకు హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఇటీవల యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఈమేరకు రామకృష్ణ, ఆయన తల్లిదండ్రులు గోపాలరావు – జయమ్మను కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, బైరెడ్డి మనోహర్రెడ్డి, మాదిరాజు లక్ష్మణరావు, జొన్నలగడ్డ గోపాలస్వామి, గునుకుల ఈశ్వరరావు, జిల్లెళ్ల కృష్ణారెడ్డి, చుక్కా, శ్రీనివాసరెడ్డి, తోట జనార్దన్, మేకల ప్రసాద్, ఎస్.కే.ఆఫ్రోజ్, షేక్ సమీర్, సయ్యద్ జావీద్ అభినందించారు.
ఖమ్మం వాసి కోటేశ్వరరావుకు..
ఖమ్మం సహకారనగర్: హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఖమ్మం చెరువుబజార్కు చెందిన బోనగిరి కోటేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ కె.గిరిబాబు, ప్రొఫెసర్లు పి.చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఇటీవల యూనివర్సిటీ వీసీ కిషన్కుమార్రెడ్డి చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ స్వీకరించారు.
యూపీహెచ్సీలో
డీఎంహెచ్ఓ తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం శ్రీనివాస్నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేశాక వారితో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, దోమల లార్వా నివారణ, ఫాగింగ్కు చర్యలు తీసుకోవాలని, జ్వరం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాలని తెలిపారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ రామారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రేష్ఠ, యూపీహెచ్సీ కోఆర్డినేటర్ బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పశువులు అక్రమ రవాణా చేస్తే చర్యలు
ముదిగొండ: అక్రమంగా పశువుల రవాణా చేపట్టే వారిపై చర్యలు తప్పవని ముదిగొండ సీఐ ఓ.మురళి హెచ్చరించారు. మండలంలోని వల్లభి సమీపాన ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఆయన వాహనాల తనిఖీలను పరిశీలించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడడే కాక పశువుల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో ఎస్ఐ అనంతరాములు, ఏఎస్ఐ సాంబశివరావు, ట్రెయినీ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూవిజన్ విద్యార్థిని
అభినందించిన చైర్మన్
ఖమ్మం సహకారనగర్: తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో ఫలితాల్లో ఆలిండియా స్థాయి 497వ ర్యాంక్ సాధించిన న్యూవిజన్ విద్యాసంస్థల విద్యార్థి పేరాల ప్రణవ్ను చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఆలిండియా స్థాయి ఓపెన్ కేటగిరీలో 497వ ర్యాంక్ సాధించటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన తండ్రి సురేష్ ప్రోత్సాహకానికి తోడు కళాశాల యజమాన్యం ఇచ్చిన శిక్షణతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇంజనీర్గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని తెలిపారు.

జేఎన్టీయూ నుంచి డాక్టరేట్

జేఎన్టీయూ నుంచి డాక్టరేట్

జేఎన్టీయూ నుంచి డాక్టరేట్

జేఎన్టీయూ నుంచి డాక్టరేట్