బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం | - | Sakshi
Sakshi News home page

బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం

Jun 4 2025 12:21 AM | Updated on Jun 4 2025 12:21 AM

బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం

బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని సీఎండీ ఎన్‌.బలరామ్‌ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన అన్ని ఏరియాల జీఎంలు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ విస్తరణ, సమస్యల పరిష్కారంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓవర్‌బర్డెన్‌ తొలగింపులో ఉన్న ఇబ్బందులు అధిగమించాలని, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన గనులు లేకపోతే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి తదితర ఏరియాలకు భవిష్యత్‌ ఉండదని, కొత్త గనుల కోసం ముమ్మరంగా ప్రయత్నించాలని అన్నారు. అటవీ అనుమతులు సాధనలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. శాంతిఖని, అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ల్లో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సత్తుపల్లిలో కోల్‌వాషరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్‌.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

ప్రజాకవి జయరాజుకు సన్మానం

సింగరేణి మాజీ ఉద్యోగి, ప్రజాకవి గొడిశెల జయరాజును కొత్తగూడెంలో సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఘనంగా సన్మానించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రూ.కోటి నగదు బహుమతి ఇస్తూ గుర్తింపునివ్వడం హర్షణీయమని సీఎండీ తెలిపారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే తాను కవిగా, ఉద్యమకారుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కోల్‌ మూమెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌డీఎం సుభాని, డైరెక్టర్లు ఎల్‌.వీ.సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై దృష్టి పెట్టాలి

సింగరేణి సీఎండీ బలరామ్‌ దిశా నిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement