
ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం, బైరవునిపల్లి, బోదులబండ, నేలకొండపల్లి, చెన్నారంల్లో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, అర్హులందరికీ కేటాయిస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ఎవరు కూడా అభద్రతా భావానికి లోనుకావొద్దని సూచించారు. కాగా, బౌద్ధక్షేత్రం సమీపంలో గుడిసెల్లో ఉంటున్న పలువురు మంత్రి శ్రీనివాసరెడ్డిని కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, భద్రయ్య, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, కె.హన్మంతరావు, వంగవీటి నాగేశ్వరరావు, వెంకన్న, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్, వేగినాటి లక్ష్మినర్సయ్య, ఉండమోదుగుల శ్రీనివాస్, తన్నీరు నారాయణ, కొమ్మూరి నరేష్, యడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో మంత్రి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో నిర్వహించే సమావేశంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు. ఆతర్వాత ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట, దారేడు, పోలిశెట్టిగూడెం, తీర్థాలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాప చేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, సాయంత్రం కూసుమంచి మండలం గట్టు సింగారం, చేగొమ్మ, బచ్చోడు, పాలేరు, నాయకునిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి