
భర్త అన్యాయం చేశాడని మహిళ నిరసన
తల్లాడ: మరో పెళ్లి చేసుకున్న భర్త తనకు అన్యా యం చేశాడంటూ ఓ మహిళ ఆయన ఇంటి ఎదుట నిరసనకు దిగింది. మండలంలోని మల్సూర్తండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... మల్సూర్తండాకు చెందిన భూక్యా నాగేశ్వర్రావు ఏడేళ్ల క్రితం కొణిజర్ల మండలం రాజ్యతండాకు చెందిన గుగులోత్ వాణిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు జన్మించాక వరకట్నం కోసం వేధిస్తుండడంతో కొణిజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆపై వాణికి విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వాణి తమ బంధువులతో కలిసి ఆయన ఇంటికి చేరుకుని నాగేశ్వరరావు, ఆయన రెండో భార్యను గదిలో నిర్బంధించి నిరసనకు దిగింది. ఈమేరకు పోలీసులు చేరుకుని స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.