
ఈనెల 21 వరకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)’ తొలిదశ షెడూ్య్ల్ విడుదలైందని ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కళాశాలలో ప్రచార పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 21 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా, 10నుంచి 22 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు, 6–10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్సులు, ఇంటర్ టీసీ, రెండు ఫొటోలతో రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్ల డించారు. ఇందుకోసం తమ కళాశాలలోని సహాయ కేంద్రంతో పాటు 98498 41555, 96188 96949 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్ శాస్త్రి, బానోత్ రెడ్డి, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సలీం పాషా, వివిధ విభాగాల బాధ్యులు సునంద, డాక్టర్ రమాసత్యవతి, ఈ.వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.