రాయచూరు రూరల్: లింగసూగురు తాలూకా హట్టి బంగారు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు లిఫ్ట్లో చిక్కుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. కేంద్ర శాఫ్ట్ లిఫ్ట్లో సాంకేతిక లోపంతో 8 మంది కార్మికులు రెండున్నర గంటల పాటు అక్కడే ఉండిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్కోత విధించడంతో సుమారు 2000 అడుగుల తోతున్న సోరంగంలోకి వెళ్లేందుకు లిఫ్ట్ను అశ్రయించారు. హన్మంతు అనే కార్మికుడికి తల తిరగడంతో కింద పడిపోయాడు. ఊపిరాడక పోవడంతో మెకానిక్లు వచ్చి లిఫ్ట్ను సరి చేశారు. అనంతరం కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు.


