వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం

Mar 27 2026 9:23 AM | Updated on Mar 27 2026 9:23 AM

హొసపేటె: నగరంలోని 1వ వార్డులోని అఖండ చిత్తవాడ్గి ఆంజనేయ స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. నూతన సంవత్సర పండుగ అయిన ఉగాది సందర్భంగా ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ రథోత్సవాన్ని బుధవారం సాయంత్రం 6 గంటలకు అక్కడకు చేరుకున్న వేలాది మంది భక్తుల సమక్షంలో లాగారు. దీనికి ముందు జెండా వేలం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రథాన్ని లాగడానికి ఆదేశించారు. ప్రధాన వీధి నుంచి రథాన్ని బసవన్న పాదగట్టె వరకు లాక్కొచ్చారు. రథోత్సవం సాగే మార్గంలో, ఆ మార్గానికి దిగువన ఉన్న ఇళ్ల నుంచి వేలాది మంది ప్రజలు రథం పైకి పూలు, పండ్లు విసురుతూ తమ భక్తిని చాటుకున్నారు. చిత్తవాడ్గి యువకులు వివిధ రకాల చెక్క వాయిద్యాలను వాయిస్తూ జనసమూహాన్ని ఆకట్టుకున్నారు. మరోవైపు రథాన్ని లాగడంలో యువకుల బృందాల మధ్య పోటీ నెలకొంది. ఈ సందడి మధ్యే జాతరలో వివిధ రకాల బెలూన్లు, పిల్లనగ్రోవులు, ఇతర పిల్లల ఆట వస్తువులను ప్రత్యేకంగా విక్రయించారు. తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకునేందుకు గాను గోవింద నగర్‌, సంతె బయలు ప్రాంతాలకు చెందిన పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు, రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ, శీతల పానీయాలను పంపిణీ చేశారు. చిత్తవాడ్గి, అమరావతి, ఎరెబయలు, హొసూరు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement