నేడు బంగారు పరమేశ్వర దర్శనం
మహాశివరాత్రి రోజున మైసూరు ప్యాలెస్ ఆవరణలోని త్రినేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్టు శివలింగానికి బంగారు పరమేశ్వరుని ముఖం ధారణ చేసి విశేష పూజలు జరపడం ఆనవాయితీ. జిల్లా అధికారులు ఆలయ అర్చకులకు బంగారు ముఖాన్ని అప్పగించారు. అప్పటి రాజు జయచామరాజ ఒడెయర్ పుత్ర సంతానం ప్రాప్తమైనందుకు 11 కేజీల శుద్ధ బంగారంతో తయారు చేయించారు. ఏడాదంతా ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరిచి, శివరాత్రి రోజున మాత్రమే త్రినేశ్వర స్వామి మూల శివలింగానికి తొడిగి పూజలు చేస్తారు. కళ్లారా చూసేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు.


