బళ్లారి– కుమటా బస్సు పల్టీ | - | Sakshi
Sakshi News home page

బళ్లారి– కుమటా బస్సు పల్టీ

Oct 20 2025 9:18 AM | Updated on Oct 20 2025 9:18 AM

బళ్లారి– కుమటా బస్సు పల్టీ

బళ్లారి– కుమటా బస్సు పల్టీ

యశవంతపుర: కేఎస్‌ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 49 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద జరిగింది. శనివారం రాత్రి అంకోలా తాలూకా వడ్డి ఘాట్‌లో బస్సు పల్టీ పడింది. కుమటా – శిరసి మార్గంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా సంచారాన్ని బంద్‌ చేశారు. శిరసికి వెళ్లే వాహనాలను వడ్డి ఘాట్‌ రోడ్డు వైపు మళ్లించారు. ఇరుకై న మలుపుల్లో బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల పల్టీ కొట్టింది. ఈ బస్సు బళ్లారి సిటీ నుంచి కుమటాకు వెళ్తోంది. డ్రైవరుతో సహా 49 మంది గాయాల పాలయ్యారు. అంకోలా, కుమటా కు బాధితులను తరలించారు. మరోవైపు శివమొగ్గ, మండ్య వద్ద ప్రమాదాలు జరిగాయి.

49 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement