
ఛాయాచిత్ర సంబరం
బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రకళా పరిషత్లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శనకు కళాప్రియులను ఆకట్టుకుంటోంది. నగరవాసులు పెద్దఎత్తున విచ్చేసి అపురూపమైన ఛాయాచిత్రాలను వీక్షించారు. ఆదివారం కావడంతో నగరవాసులు పెద్దసంఖ్యలో వచ్చారు. మురిపించే చిత్రాలను మొబైల్, కెమెరాలో బంధిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఛాయాచిత్రాలు తీసిన ఫోటోగ్రాఫర్లకు సలాన్ నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్శాస్త్రి, గిరీశ్ అనంతమూర్తి, ప్రేమకాకడే, అనితా మైసూరు పాల్గొన్నారు.
మురిపిస్తున్న సలాన్

ఛాయాచిత్ర సంబరం