జస్టిస్‌ దాస్‌ నివేదికను తిరస్కరించాలి | - | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ దాస్‌ నివేదికను తిరస్కరించాలి

Sep 14 2025 3:25 AM | Updated on Sep 14 2025 3:25 AM

జస్టిస్‌ దాస్‌ నివేదికను తిరస్కరించాలి

జస్టిస్‌ దాస్‌ నివేదికను తిరస్కరించాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని మాదిగ, ఉప కులాల ఎస్సీ వర్గీకరణ సమితి సంచాలకుడు శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణలో కాంగ్రెస్‌ సర్కార్‌ వర్గీకరణకు జిస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ నివేదికను అందించారన్నారు. అందులో ఎస్సీ వర్గాలకు చెందిన వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని కమిషన్‌ అధ్యక్షుడిగా నియమించడంంతో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆది కర్ణాటక, ద్రావిడ, ఇతర ఉప కులాలను చేర్చడంలో లోపాలున్నాయని, వాటిని సవరించాలన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను స్థానభ్రంశం చేయాలని, అధికారులు మణివణ్ణన్‌, రాకేష్‌ కుమార్‌, వెంకటయ్యలను బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement