
యువతకు మార్గదర్శకులుగా ఉండాలి
బళ్లారిఅర్బన్: ఆధునిక పోకడలు, మానసిక ఒత్తిళ్లు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం ఫలితంగా యువత దారి తప్పుతోందని, పోషకులు తమ పిల్లలను సరైన మార్గంలో ఉంచాలని శ్రీ వాసవీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు విఠ కృష్ణ కుమార్ అన్నారు. విద్యార్థుల మనోభావన, ఆధునిక సాంకేతిక విజ్ఞాన ప్రభావం, జనాభా నియంత్రణ అనే అంశాలపై యువతను జాగృతి చేసేందుకు వాసవీ స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలను తీర్చిదిద్దాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల హెచ్ఎం వీరేష్ మాట్లాడుతూ యువత సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండాలన్నారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు జితేంద్ర, కార్యదర్శులు సురేష్, జేసీ వఠం ఆధిత్య, అగడి గవిసిద్దేశ్వర ప్రసాద్, ముదగల్ సుభాష్, విజయ్కుమార్, హస్య కళాకారులు ఎర్రిస్వామి, చంద్రశేఖర్ ఆచార్ తదితరులు పాల్గొన్నారు.