
బంగారు, ఖనిజ నిక్షేపాలపై సర్వేకు అనుమతి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో బంగారు, ఖనిజ నిక్షేపాల సర్వేకు అనుమతించింది. కర్ణాటక బంగారు ఉత్పత్తికి పుట్టినిల్లుగా మారింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో, కోలార్ కేజీఎఫ్లో ప్రస్తుతం బంగారు ఉత్పత్తి కొనసాగుతోంది. రెండు కాకుండా మరో ఏడు చోట్ల బంగారు, ఖనిజ నిక్షేపాలకు కేంద్రం సర్వేకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 34 చోట్ల ఖనిజ అన్వేషణకు ఎన్ఎంఈటీకి అప్పగించగా 23 పూర్తి కాగా 11 చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. నాలుగు ప్రాంతాల్లో పరిశోధనకు కేంద్రం రూ.7.15 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్రంలో బంగారు నిక్షేపాలకు కొప్పళ జిల్లా కిల్లరహట్టి, బళ్లారి జిల్లా సిరిగేరి, హావేరి జిల్లా నాగవంద, కార్కోళ్, హాసన్ జిల్లా రంగాపూర, చిక్క మగళూరు జిల్లా కళశాపూర్, మండ్య జిల్లా యడియూరు వద్ద సర్వేలు జరిపారు. బళ్లారి జిల్లా సిరిగేరిలో, హావేరి జిల్లా నాగవంద, కార్కోళ్లో, దావణగెరెలోని కుదురుకొండ, హల్లవన గల్లి, చిక్కమగళూరు జిల్లా కళశాపూర్లో బంగారు, హాసన్ జిల్లా రంగాపుర, రామపుర, గొల్లరహట్టిలో ప్లాటినం, మండ్య జిల్లా యడియూరులో బంగారు, తామ్ర నిక్షేపాలున్నట్లు గుర్తించారు. వీటిని జియో మైరన్ సొల్యూషన్ మైనింగ్ టేక్ కన్సెల్టెన్సి సర్వీస్ కంపెనీ, ఓమెన్ ల్యాబరేటరీ, అన్వేషణ సంస్థ, ఎంఈసీఎల్ సర్వేలు జరుపుతున్నాయి.
కర్ణాటకలో ఏడు జిల్లాల్లో సర్వేకు
కేంద్రం శ్రీకారం
నాలుగు చోట్ల పరిశోధనకు రూ.7.15 కోట్లు వ్యయం

బంగారు, ఖనిజ నిక్షేపాలపై సర్వేకు అనుమతి