వికటించిన పెళ్లి భోజనం | - | Sakshi
Sakshi News home page

వికటించిన పెళ్లి భోజనం

May 8 2025 9:13 AM | Updated on May 8 2025 9:13 AM

వికటించిన పెళ్లి భోజనం

వికటించిన పెళ్లి భోజనం

150 మంది అతిథులు ఆస్పత్రి పాలు

సాక్షి,బళ్లారి: పెళ్లి భోజనం వికటించి 150 మంది ఆస్పత్రి పాలైన ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మల్లిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పెళ్లి భోజనం వికటించడంతో పలువురు ఆస్పత్రి పాలు కావడం కలకలం రేపింది. మల్లిపల్లి గ్రామానికి చెందిన ప్రభులింగప్ప అనే వ్యక్తి కుమారుడి పెళ్లికి హాజరైన వారికి భోజనాలు చేసిన తర్వాత వాంతులు, విరోచనాలు కావడంతో ఒకరి తర్వాత ఒకరు చొప్పున 150 మందికి పైగా ఒకే సమస్యతో బాధపడటంతో పెళ్లిలో భోజనం వికటించి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. మల్లిపల్లి గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారు పెళ్లికి హాజరు కావడంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారందరినీ శ్రీరాంపుర ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. దీంతో ఆస్పత్రిలో బెడ్లన్ని ఫుల్‌ అయ్యాయి. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో వాంతులు, విరోచనాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement