
పేదలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వండి
రాయచూరు రూరల్: నగరంలోని మురికి వాడల్లో నివసించే పేద ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలని మురికి వాడల క్రియా వేదిక అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్ల నుంచి మురికి వాడల్లో నివసిస్తున్న వారికి నగరసభ అధికారులు, నగర ప్రాధికార అధికారులు మౌనం వహించారన్నారు. నగర ప్రాంతంలో నివసించే వారి కోసం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. 2024లో 3.36 లక్షల మందిలో కేవలం 1.64 లక్షల మందికి హక్కు పత్రాలను అందించారన్నారు. కానీ వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడంలో ఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ప్రభుత్వం మురికి వాడల ప్రజలకు ఇళ్ల హక్కు పత్రాలివ్వాలన్నారు.