
ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్య
బళ్లారి అర్భన్: బళ్లారిలో ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్యకు మైలురాయిలా నంది గ్రూఫ్ఆఫ్ ఇన్స్ట్యూషన్స్ 35 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఈ సంస్థ కొత్తగా నంది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్ ఏర్పాటు చేసింది. స్థానిక పటేల్ నగర్లోని ఇంట్యూరి నగర్లో కొత్తగా నిర్మించిన నంది క్యాంపస్లో ఆదివారం నంది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. బళ్లారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రపంచస్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ విద్యాసంస్థ ఏర్పాటైంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా నంది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో బోధన చేస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధునిక బోధన సదుపాయాలకు ఈ విద్యాకేంద్రం కల్పవృక్షంగా మారింది. విద్యార్థి చదువుకు పునాదిగా నిలిచే నర్సరీ నుంచి ప్రాథమిక, ఉన్నత విద్యను ఇక్కడ విద్యార్థులు అభ్యసించవచ్చు. అత్యంత వేగంగా ప్రపంచం పరుగులు తీస్తున్న తరుణంలో అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, వారి భవితను బంగారు బాటలో పయనింప జేసేందుకు ఈ విద్యాసంస్థ కృషిచేస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంది గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కే.ఇక్బాల్ అహమ్మద్, ఇస్మతున్నిషా, నంది గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కార్యదర్శి కే. ఉమైర్ అహమ్మద్, డైరెక్టర్సు ఉబైద్ అహమ్మద్, ఉజైర్ అహమ్మద్, నంది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రిన్సిపాల్ సయ్యద్ అక్రమ్, ప్రిన్సిపాల్స్, ఇతర నంది విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది బళ్లారిలోని ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బళ్లారిలో నంది స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో వక్తలు

ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్య

ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్య