కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు | - | Sakshi
Sakshi News home page

కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు

Apr 18 2025 12:52 AM | Updated on Apr 18 2025 12:52 AM

కట్టడ

కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు

యశవంతపుర: నిర్మాణంలో ఉన్న కట్టడంలో దంపతులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరు సంజయనగర పోలీసుస్టేషన్‌ డాలర్స్‌ కాలనీలో జరిగింది. యాదగిరికీ చెందిన మెహబూబ్‌ (45), భార్య పర్వీన్‌ (35)లు డాలర్స్‌ కాలనీలోని నిర్మాణంలో ఉన్న భవనం మేస్త్రి పని చేస్తూ, పర్వీన్‌ కూలీ పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. రంజాన్‌ పండుగకు యాదగిరికి వెళ్లి తిరిగివచ్చారు. మూడు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. మెహబూబ్‌ కోపంతో పర్వీన్‌ను గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది, మెహబూబ్‌ భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్‌ తెలిపారు. మూడు రోజుల కిందటే మరణించినా, అక్కడ ఎవరూ లేని కారణంగా గుర్తించలేదు. గురువారం ఉదయం కట్టడం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంజయనగర పోలీసులు చేరుకుని పరిశీలించగా కిందపడి ఉన్న మహిళ శవం, ఉరికి వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించాయి. యాదగిరిలోని సంబంధీకులకు సమాచారం అందించి విచారణ చేపట్టారు.

హత్య, అత్మహత్యగా అనుమానం

కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు 1
1/1

కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement