సిద్దూ.. పద్ధతి మార్చుకో | - | Sakshi
Sakshi News home page

సిద్దూ.. పద్ధతి మార్చుకో

Apr 18 2025 12:52 AM | Updated on Apr 18 2025 12:52 AM

సిద్దూ.. పద్ధతి మార్చుకో

సిద్దూ.. పద్ధతి మార్చుకో

శివాజీనగర: సీఎం సిద్దరామయ్య పేదల, దళితుల, రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా? అభివృద్ధి పనులు చేపట్టారా? అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ప్రశ్నించారు. గురువారం బాగలకోటలో జనాక్రోశ యాత్ర నిర్వహించారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. హిందూ మహిళలపై అవమానాలు, గోహత్యలు, లవ్‌ జిహాద్‌ పెరిగాయి, రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలంటే రూ. 3 లక్షలు చెల్లించాలి అని ఆరోపించారు. వీరశైవ మతం అని రాష్ట్రంలో నిప్పు పెట్టే పని చేశారన్నారు. ముస్లిం మహిళలకు వివాహానికి రూ.50 వేలు ఇస్తామన్నారు. హిందువుల్లో పేదవారు లేరా? ముస్లిం యువత విదేశాలలో చదివేందుకు రూ.30 లక్షలు ఇస్తామని చెప్పారు. హిందువుల్లో పేదవారు లేరా అని ప్రశ్నించారు. హిందువులను ఎందుకోసం అవమానం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనలో ఎంపీలు జగదీశ్‌ శెట్టర్‌, గోవింద కారజోళ, పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జనాక్రోశ యాత్రలో విజయేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement