మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత

Apr 18 2025 12:44 AM | Updated on Apr 18 2025 12:44 AM

మాజీ

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత

సాక్షి,బళ్లారి: నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మామ, సతీమణి విజయలక్ష్మి తండ్రి రామిరెడ్డి రామచంద్రారెడ్డి నగరంలోని అశోక్‌ నగర్‌లోని గాలి సోమశేఖరరెడ్డి స్వగృహంలో మృతి చెందారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.రామిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు నెల్లూరు జిల్లా ఓలిపేడు గ్రామం కాగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు విజయలక్ష్మి, సుప్రజలున్నారు. గాలి సోమశేఖరరెడ్డి సతీమణి గాలి విజయలక్ష్మి తన తండ్రికి తమ ఇంటి వద్దనే సపర్యలు చేస్తుండగా అనారోగ్యంతో మృతి చెందడంతో గాలి సోమశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. శుక్రవారం నగరంలోని హరిశ్చంద్ర ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు జరుపుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీరామ సేన ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ

హుబ్లీ: విద్యార్థిని నేహా హిరేమఠకు శ్రద్ధాంజలితో పాటు న్యాయం, మహిళల స్వరక్షణ కోసం త్రిశూల దీక్ష, లవ్‌ జిహాద్‌ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా శ్రీరామ సేన ఆధ్వర్యంలో నగరంలో భారీగా ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆరాధ్యదైవం సిద్దారూఢ మఠం ఆవరణలో శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర కులకర్ణి ర్యాలీని ప్రారంభించారు. మఠం నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రముఖ సర్కిళ్ల మీదుగా మూరుసావిర మఠం ఆవరణకు చేరుకుంది. ర్యాలీలో విశేషంగా ఆటోలతో పాటు మంజునాథ, లోకేష్‌, మహంతేష్‌, నాగరాజ్‌, గుణధర్‌, ప్రకాష్‌ ఉళ్లాగడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల దరికి సంక్షేమ పథకాలు

రాయచూరు రూరల్‌: ప్రజల చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు విధులు నిర్వహించాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ సూచించారు. బుధవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయంలో 28 మత్య్సకార కుటుంబాలకు కిట్లు, 31 మంది లబ్ధిదారులకు గంగా కళ్యాణ ఫథకంలో మోటారు పంప్‌సెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌, రంగ బసనగౌడ, ప్రకాష్‌ పాల్గొన్నారు.

పెంచిన ధరలు తగ్గించండి

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని మురికివాడల క్రియా వేదిక డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు జనార్దన్‌ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.

ముస్లిం పిల్లలకు

ఉచిత ఖత్నా

హొసపేటె: అంజుమన్‌ ఖిద్మత్‌ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నగర, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 140 మంది ముస్లిం సోదరుల పిల్లలకు ఉచిత సున్తీ(ఖత్నా) నిర్వహించింది. సున్తీ చేయించుకున్న పిల్లలందరికీ వైద్య సామగ్రి, పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కమిటీ చైర్మన్‌ హెచ్‌ఎన్‌.మహ్మద్‌ ఇమాం నియాజీ మాట్లాడుతూ ఇస్లాం మతం ప్రకారం ప్రతి ముస్లిం సున్నత్‌ ఇబ్రహిం(సున్నతి) చేయించుకోవడం తప్పనిసరి ఆచారం అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడానికి కమిటీ ఉచిత సున్తీ నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది 140 మందికి పైగా పిల్లలకు సున్తీ నిర్వహించామన్నారు. అంజుమన్‌ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హబీబుల్లా, డాక్టర్‌ కలీముల్లా, ఫైరోజ్‌ ఖాన్‌, కార్యదర్శి మహ్మద్‌ అబూబకర్‌ అష్రఫీ, కో–ఆర్డినేటర్‌ మహ్మద్‌ దర్వేష్‌, చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌లతో పాటు వందలాది మంది తల్లిదండ్రులు, సంఘం సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత 1
1/3

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత 2
2/3

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత 3
3/3

మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement