
కులగణన సమీక్షను అంగీకరించం
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడానికి సిద్ధమైన కులగణన సమీక్ష అశాసీ్త్రయమైందని, దీన్ని తాము వ్యతిరేకిస్తామని వరూరు నవగ్రహ క్షేత్రం ఏజీఎం గ్రూప్ సంస్థల అధ్యక్షులు, జాతీయ సంత ఆచార్య గురుధర నంది మహారాజ్ తెలిపారు. వరూరు క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జైన్ సమాజం కేవలం 1,65,565 జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అది సమంజసం కాదన్నారు. దీంతో జైన్ సమాజానికి అన్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల తానే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమ సమాజ బాంధవుల సమీక్ష నిర్వహించి జూన్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానన్నారు. ప్రభుత్వం కులగణన సమీక్ష వేళ ఇప్పటి వరకు ఎవరూ తనను గాని సమాజం వారిని కాని కలవలేదన్నారు. ఇప్పుడేమో ఉన్నఫళంగా జనగణన సమీక్ష జారీ చేస్తున్నారన్నారు. దీని వల్ల జైన్ సమాజానికి తీవ్రం అన్యాయం జరుగుతుందన్నారు. తన ఆధ్వర్యంలో చేపట్టే సమీక్ష నివేదికను ప్రభుత్వం పరిగణించాలి, లేకుంటే చట్టరీత్య పోరాటం చేస్తామన్నారు.