మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరం

Apr 17 2025 12:36 AM | Updated on Apr 17 2025 12:36 AM

మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరం

మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరం

హొసపేటె: మాదకద్రవ్యాల వాడకం వైరస్‌లాంటిది, ఒకసారి సోకిన తర్వాత కోలుకోవడం కష్టం అని జిల్లా జడ్జి అబ్దుల్‌ రెహమాన్‌ ఏ.నందగాడి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని విజయనగర కళాశాలలో తాలూకా లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, బార్‌ అసోసియేషన్‌, విద్యా శాఖ, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖల సహకారంతో మాదకద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఎన్‌డీపీఎస్‌ చట్టంపై నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కావడం పెరిగింది. వివిధ విభాగాలు సామాజిక బాధ్యతలో విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి బలమైన మనస్తత్వం, శారీరక ఆరోగ్యం, మేధో ధైర్యం అవసరం అన్నారు. విద్యార్థి జీవితంలో చదవడం, జ్ఞానాన్ని సంపాదించడం వంటి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థి జీవితంలో అనుకరణ, అనుమానాస్పద మనస్తత్వం ప్రబలంగా ఉంటాయని న్యాయమూర్తి ప్రశాంత్‌ నాగలాపుర అన్నారు. మంచి కంటే చెడు పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, యువత మాదకద్రవ్యాల దుర్వినియోగానికి ఎక్కువగా గురవుతున్నందున అవగాహన పెంచడం సంఘసంస్థల బాధ్యత అన్నిరు. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలంటే మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలన్నారు. ఎస్పీ శ్రీహరిబాబు, వైద్యులు సోమశేఖర్‌ విజయనగర కళాశాల అధ్యక్షులు మేటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement