హొసపేటె: భాష, సంస్కృతి, కళల రక్షణకు సమాజంలో నిరంతరంగా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఎంతో అవసరమని ఎంపీ ఈ.తుకారాం తెలిపారు. ఆదివారం గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో గానగంగా కళాప్రతిష్టాన, కన్నడ, సంస్కృతి శాఖ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కుల సంస్కృతి సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా మనుగడ సాగిస్తూ పెరుగుతుందన్నారు. అయితే, నేటి యువతరం సాంస్కృతిక కార్యకలాపాలకు దూరం కావడం విచారకరమన్నారు. కర్ణాటక విద్యావర్థక సంఘానికి చెందిన డాక్టర్ పాటిల్ పుట్టప్ప సభా భవన్లో సమాన కళా అకాడమి, కన్నడ, సంస్కృతి శాఖ సహకారంతో నిర్వహించిన దసరా పండుగ వేడుకల్లో భాగంగా మహిళా సాంస్కృతిక ఉత్సవా ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి కాలంలో విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతికి బానిసలై స్వదేశీ సంస్కృతిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాలలో సాంస్కృతిక తరగతులు ప్రారంభించడం ఎంతో అవసరమన్నారు. వేదికపై ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకొన్నాయి. హుడా అధ్యక్షులు హెచ్ ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, గానగంగా కళా ప్రతిష్టాన అధ్యక్షులు యల్లప్ప బండార్, సంగీత కళాకారుడు పండిట్ సదాశివ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో కళల రక్షణ