రాయచూరు రూరల్: నగరాల్లో ప్రాణులకు, పక్షులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని పచ్చని చెట్ల బళగ సంచాలకుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కృష్ణగిరి హిల్స్ చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవిలో దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్లో ఎండల వారి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. సమితి నేతలు నూతన్ రాజ్, రామమూర్తిలున్నారు.
ట్రక్ టర్మినల్ పనుల
పూర్తికి సూచన
రాయచూరు రూరల్: నగరంలో ట్రక్ టర్మినల్ పనులు త్వరితిగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. సోమవారం యరమరస్ వద్ద 25 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న దేవరాజ అరసు ట్రక్ టర్మినల్ పనులను పరిశీలించి ఉన్నతాధికారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. రాయచూరు జిల్లాలో పత్తి, మిరప, వరి తదితర వాణిజ్య పంటలు అధికంగా పండించే రైతుల సరుకులను రవాణా చేసే లారీల నిలుపుదలకు దేవరాజ అరసు ట్రక్ టర్మినల్ను పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు. మంత్రి వెంట రుద్రప్ప, శాంతప్ప, శివమూర్తి, జయన్న, లక్ష్మిరెడ్డి, బసవరాజ్, నరసింహులున్నారు.
కాగెకెరె వాసులకు
ఇళ్ల పట్టాలివ్వరూ
రాయచూరు రూరల్: నగరంలోని కాగెకెరె చెరువు ప్రాంతంలో నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాలివ్వాలని నగర బీజేపీ సంచాలకులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సిటీ కార్పొరేషన్లో 23వ వార్డు మడ్డిపేట కాగెకెరె చెరువు వద్ద 50 ఏళ్లుగా పేద కూలి కార్మికులు అధికంగా నివసిస్తున్నారన్నారు. అలాంటి 200 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని, కర్ణాటక మురికి వాడల మండలి నుంచి వంద ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
రైల్వే డిమాండ్లు
తీర్చాలని వినతి
హొసపేటె: ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదల కోసం హొసపేటె నుంచి కొట్టూరు మీదుగా మంగళూరుకు ప్రత్యేక రైలు సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల సౌకర్యం కోసం హొసపేటె రైల్వే స్టేషన్లో రెండు కొత్త ప్లాట్ఫాంల నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణతో సహా పలు డిమాండ్లను తీర్చాలని నైరుతి రైల్వే జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్కు రైల్వే సమితి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. విజయనగర రైల్వే అభివృద్ధి కార్యాచరణ కమిటీ సీనియర్ సభ్యుడు బాబులాల్ జైన్ నేతృత్వంలోని ఆ కమిటీ ఆఫీస్ బేరర్లు ఈ ప్రతిపాదనలను సమర్పించారు. పుక్రాజ్ చోప్రా, ప్రభాకర్, మహేష్ కుడుతిని, రామకృష్ణ, ప్రౌమా మహేశ్వర్, నజీర్ సాబ్, విశ్వనాథ్ కెవటర్, అశోక్ జైన్, జబ్బార్, రాజ్ పురోహిత్, వరుణ్, రంగనాథ, రమేష్ లమాణి తదితరులు పాల్గొన్నారు.
విమానయాన సంస్థ
సేవలపై హర్షం
హుబ్లీ: హుబ్లీ నుంచి మరో విమాన యాన సంస్థ సేవలు ప్రారంభించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సదరు విమాన సేవలతో రోజు మూడు విమానాలు బెంగళూరు– హుబ్లీల మధ్య సేవలు అందించనున్నాయన్నారు. గతంలో ఇండిగో అధికారులతో చర్చలు జరిపి మధ్యాహ్నం వేళ విమాన సేవ ప్రారంభించాలని సూచించానన్నారు. ఈ సేవ వల్ల హుబ్లీ– ధార్వాడ తదితర చుట్టు పక్కల జిల్లాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో అనుకూలం అన్నారు. ప్రస్తుతం తాజాగా మరో విమాన సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండిగో అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. హుబ్లీ నుంచి అహ్మదాబాద్ వరకు నూతన విమాన సేవను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తొట్టెలతో పక్షుల దాహార్తికి చెక్
తొట్టెలతో పక్షుల దాహార్తికి చెక్
తొట్టెలతో పక్షుల దాహార్తికి చెక్