పరీక్షలకు అభ్యంతరంపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు అభ్యంతరంపై ధర్నా

Mar 25 2025 1:41 AM | Updated on Mar 25 2025 1:35 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై విద్యార్థులు ధర్నాకు దిగారు. సోమవారం వర్సిటీలో జరుగుతున్న ఎంఏ సోషియాలజీ పరీక్ష రాయడానికి హాల్‌ టికెట్లను ఇవ్వకుండా వేధిస్తుండడంతో విద్యార్థులు పైఅంతస్తులోకి వెళ్లి ఆత్మహతాయత్నం చేస్తుండగా యరగేర పోలీసులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అధ్యాపకులు రాధ, శకుంతల తదితరులు అడ్డుకొని పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించకుండా హాల్‌ టికెట్లు ఇవ్వకుండా వేధించడం, గైర్హాజరైన విద్యార్థులను పిలిచి అపాలజీ లేఖ రాయించుకున్నారన్నారు. అధ్యాపకులు తమపై ద్వేషం పెంచుకున్నారని ఆరుగురు విద్యార్థులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement