హొసపేటె: క్షయవ్యాధిపై అవగాహన అవసరమని విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ పేర్కొన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం క్షయవ్యాధిపై ఏర్పాటు చేసిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్షయ మైకోబ్యాక్టోరియం ట్యూబక్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా కలిగే అంటువ్యాధి అన్నారు. శరీరంలోని ఏ అవయవానికై నా ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఎక్కువగా ఊపిరితిత్తులకు సంక్రమిస్తుందన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యులను సన్మానించారు. హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ, జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్, వైద్యులు సోమశేఖర్, వస్త్రద్ తదితరులు పాల్గొన్నారు.