బనశంకరి: రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు కోసం సీఎం సిద్దరామయ్య సోమవారం నివాస కార్యాలయం కృష్ణాలో దళిత నేతలు, మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. తరువాత విలేకరులతో మంత్రి హెచ్సీ మహదేవప్ప మాట్లాడుతూ మూడు గంటల పాటు సమావేశం జరిగింది. రిజర్వేషన్ అమలు కమిటీ అధ్యక్షుడు నాగమోహన్దాస్ కూడా పాల్గొన్నారు. రిజర్వేషన్ అమలుపై చర్చించామన్నారు. వారంలోగా నివేదిక అమలు చేస్తారని తెలిపారు. ఉద్యోగుల గురించి అన్ని శాఖలు వివరాలు అందించాయని చెప్పారు. హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అంతర్గత రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మేనిఫెస్టోలో చెప్పామన్నారు. నాగమోహన్దాస్ కమిటి అందించే మధ్యంతర నివేదిక పై సీఎంతో చర్చించి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతవరకు పోస్టుల భర్తీ, పదోన్నతులను నిలిపివేస్తామన్నారు.
సీఎం నివాసంలో భేటీ