హనీట్రాప్‌పై విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌పై విచారణ చేయాలి

Mar 25 2025 1:39 AM | Updated on Mar 25 2025 1:35 AM

సుప్రీంకోర్టులో పిటిషన్‌

బనశంకరి: కర్ణాటకలో భారీ సంచలనం సృష్టించిన మంత్రులు, ఎమ్మెల్యేల హనీట్రాప్‌ వ్యవహారం మీద విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌ విచారణ కు తీసుకోవడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది. ధన్‌బాద్‌ నివాసి వినయ్‌కుమార్‌సింగ్‌.. ఈ వ్యాజ్యం వేశారు. కర్ణాటకలో మంత్రి, న్యాయమూర్తితో పాటు పలువురిని హనీట్రాప్‌ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్వతంత్ర విచారణ కు ఆదేశించాలని పిటిషన్‌లో విన్నవించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా ధర్మాసనం.. ఒకటి రెండు రోజుల్లో పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వ్యక్తి, న్యాయమూర్తి తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్‌ కు పాల్పడ్డారని మంత్రి ఒకరు ఆరోపించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థ విశ్వాసం కాపాడేదృష్టితో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అర్జీదారు పేర్కొన్నారు.

వల విసిరిందెవరో

సస్పెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement