కెజీఎఫ్: పట్టపగలే రౌడీషీటర్ను హత్య జరిగింది. హతుడు కేజీఎఫ్ నగరంలోని అండర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధి వాసి. న్యూ మాడల్ నివాసి జయశీలన్ కుమారుడు రౌడీషీటర్ శివకుమార్ (28) హత్యకు గురైన వ్యక్తి. వివరాలు.. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో శివకుమార్ తన స్నేహితురాలితో కలిసి బైక్లో కామసముద్రం వైపు వెళుతున్నాడు. విరూపాక్ష పురం వద్ద వెనుకనుంచి వెంబడించి వచ్చిన నలుగురు దుండగులు మచ్చు కొడవళ్లతో అతన్ని నరికారు. తీవ్రంగా గాయపడిన శివకుమార్ తప్పించుకుని కామసముద్రం అటవీ ప్రదేశం వరకు పరిగెత్తుకు వచ్చి అక్కడే ప్రాణాలు వదిలాడు. అతని స్నేహితురాలు ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించారు. చివరికి డ్రోన్ సహాయంతో అన్వేషించి మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శాంతరాజు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. అండర్సన్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షలే కారణమని తెలుస్తోంది.
కేజీఎఫ్ వద్ద... వెంటాడి రౌడీ నరికివేత