బళ్లారిఅర్బన్: కప్పగల్ రోడ్డులోని రాధాకృష్ణ మందిరం ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం సాయంత్రం శోభ యాత్రను ఘనంగా నిర్వహించారు. ముందుగా మందిరంలో రాధాగోవింద మూర్తులకు విశేష పూజలు నెరవేర్చారు. మహా ప్రసాదం వినియోగం తదితరాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు అలరించాయి. సాయంకాలం రాధాగోవిందుల చిత్రపటాలతో శోభాయాత్ర నిర్వహించారు. కప్పగల్ రోడ్డు, దుర్గమ్మ గుడి వద్ద, లోవంతెన, రాయల్ సర్కిల్, బీడీఏఏ గ్రౌండ్, బెంగళూరు రోడ్డు, మోతీ సర్కిల్, పాత డీసీ కార్యాలయం రైల్వే స్టేషన్ రోడ్డు వరకు శోభయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ఆలయ ప్రధాన నిర్వహకులతో పాటు విద్యార్థుల బృందాలు, తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా ఇస్కాన్ శోభాయాత్ర