రాయచూరు రూరల్: నగరంలోని బంగికుంటలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతుడిని బబుల్(35) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని ఏ1 ట్రేడర్స్లో విధులు నిర్వహిస్త్న్ను బబుల్ తెలంగాణలోని గద్వాల తాలూకా గట్టు మాచర్లలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని భావించిన ప్రత్యర్థులు చాకుతో పొడిచి హత్య చేసి పారిపోయినట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.