పట్టపగలే యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే యువకుడి హత్య

Mar 16 2025 12:32 AM | Updated on Mar 16 2025 12:29 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని బంగికుంటలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతుడిని బబుల్‌(35) గా పోలీసులు గుర్తించారు. నగరంలోని ఏ1 ట్రేడర్స్‌లో విధులు నిర్వహిస్త్న్ను బబుల్‌ తెలంగాణలోని గద్వాల తాలూకా గట్టు మాచర్లలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని భావించిన ప్రత్యర్థులు చాకుతో పొడిచి హత్య చేసి పారిపోయినట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఉమేష్‌ నారాయణ కాంబ్లే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement