మరణంలోనూ జీవనదానం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ జీవనదానం

Mar 16 2025 12:32 AM | Updated on Mar 16 2025 12:29 AM

శివమొగ్గ: బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ మానవత చాటిన ఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. వివరాలు.. కృషినగర 1వ క్రాస్‌ నివాసి ఎస్‌సీ రమేష్‌ (57) అనే వ్యక్తి ఈనెల 10న సాయంత్రం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్‌డెడ్‌ అని డాక్టర్లు నిర్థారించారు. వైద్యుల అభ్యర్థన మేరకు ఆయన భార్య సవిత, కుమారుడు నిశ్చిత్‌, కుటుంబ సభ్యులు అవయవాల దానానికి అంగీకరించారు. ఆయన దేహం నుంచి గుండె, మూత్రపిండాలు సహా పలు ముఖ్య భాగాలను సేకరించి అవసరమైన రోగుల కోసం ఆగమేఘాల్లో తరలించారు. సోలార్‌ రమేష్‌గా శివమొగ్గలో పేరొందిన రమేష్‌ చనిపోతూ పలువురికి సాయం చేశారని బంధుమిత్రులు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement