దొడ్డబళ్లాపురం: భవన యజమాని బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఆ భవనాన్ని సీజ్ చేశారు. దీంతో అందులో బాడుగకు ఉంటున్న 30 కుటుంబాలు వీధినపడ్డ సంఘటన దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లిలో చోటుచేసుకుంది. జవుళి బిల్డింగ్ యజమాని బ్యాంకులో కుదువపెట్టి రూ.3 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో కంతులు కట్టకపోవడంతో శనివారంనాడు ఆ భవనానికి తాళాలు వేసి జప్తు చేశారు. అందులో 30 కుటుంబాలు నివసిస్తుండగా వారందరినీ బయటకు గెంటేశారు. వీరంతా అక్కడి గార్మెంట్స్లలో పనిచేసే కూలీ కార్మికులు. పిల్లాపాపలతో ఇబ్బందులు పడ్డారు.