ఉసురుతీసిన విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉసురుతీసిన విద్యుత్‌ షాక్‌

Mar 16 2025 12:30 AM | Updated on Mar 16 2025 12:28 AM

శివమొగ్గ: ఇంట్లో నీటి ట్యాంక్‌ నింపాలని మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయబోయిన యువతి కరెంటు షాక్‌ కొట్టి మరణించింది. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి జిల్లాలోని హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. మృతురాలు నిసర్గ (18). ఆమె హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ చదివేది. షాక్‌తో యువతి అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అప్పటివరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు.

నిసర్గ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement