పుట్టినరోజు ఊటీకి వెళ్లాలని.. | - | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు ఊటీకి వెళ్లాలని..

Mar 16 2025 12:30 AM | Updated on Mar 16 2025 12:28 AM

మండ్య: బైకిస్టు వేగంగా వెళ్తూ చెట్టును డీకొనడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండ్య నగరంలోని మైషుగర్‌ స్కూల్‌ ముందు శనివారం ఉదయం జరిగింది. మృతుడు తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని దిన్నపల్లికి ఎం.అరుణ్‌ కుమార్‌ (27) కాగా, బైక్‌ వెనుక కూర్చున్న జయవేలు తీవ్రంగా గాయపడ్డాడు. అరుణ్‌కుమార్‌ పుట్టినరోజును జరుపుకోవాలని హోసూరు నుంచి ఊటీకి మిత్రునితో కలిసి బైక్‌లో బయల్దేరాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో అరుణ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ధాటికి చెట్టు కూడా విరిగిపోవడం గమనార్హం. స్థానికులు చేరుకుని జయవేలును ఆస్పత్రికి తరలించారు. మండ్య ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement