
వర్సిటీల మూసివేతపై తీర్మానం కాలేదు
బెంగళూరు చెత్త ఓ మాఫియా
శివాజీనగర: బెంగళూరు చెత్త అనేది ఒక మాఫియా, ఎమ్మెల్యేలే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని డీసీఎం డీ.కే.శివకుమార్ విధాన పరిషత్లో ఆరోపించారు. జీరో అవర్లో కాంగ్రెస్కు చెందిన నాగరాజ్ యాదవ్ బెంగళూరు చెత్త సమస్యపై ప్రస్తావించారు. సమాధానం ఇచ్చిన డీసీఎం చెత్త అనేది మాఫియా, చెత్త విషయమై బెంగళూరు ఎమ్మెల్యేలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీల వారు ఉన్నారు. చెత్త తొలగింపునకు రూ.800 కోట్లు అంటే తనకే షాక్ తగిలింది. మూడు నెలల నుంచి మహాదేవపురలో చెత్త లారీ అలాగే నిలబడిందన్నారు. బెంగళూరు పరిధి నుంచే చెత్త వెళ్లాలి అనేది తన అభిప్రాయం. ఇందుకోసం తగిన స్థలం కోసం వెదుకుతున్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామమూర్తి వ్యాఖ్యలను ప్రస్తావించిన డీకే శివకుమార్, ఎవరో ఆ మహావ్యక్తి టెండర్ పిలువకుండా ఉన్నాడు. డీ.కే.శివకుమార్ రూ.15 వేల కోట్లు కొల్లగొట్టాడని విలేకరుల సమావేశం జరిపాడని ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
శివాజీనగర: విశ్వవిద్యాలయాలను మూసివేయడంపై ఎలాంటి తీర్మానం కాలేదు.. కేబినెట్ ఉపసంఘం నివేదిక ఇంతవరకు రాలేదు, అప్పుడే బీజేపీకి ఆందోళన ఎందుకు? అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాసనసభలో శుక్రవారం ఘాటుగా ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ఈ విషయంపై ప్రస్తావించిన విషయంపై స్పందించిన సీఎం, ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ విషయంపై కూలంకుషంగా పరిశీలనకు ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. ఉపసంఘం నివేదిక సమర్పణ పెండింగ్లో ఉంది. నివేదిక రాగానే దానిని కేబినెట్ ముందు ఉంచి చర్చించి ఆ తరువాత తీర్మానం తీసుకొంటామన్నారు. నివేదిక రాకముందే విశ్వవిద్యాలయాలను మూసివేస్తామని చెప్పటం సరికాదు. ఇటువంటి తీర్మానం తమ ద్వారా కాలేదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. అంతకు ముందు బీజేపీ సభ్యుడు డాక్టర్ సీ.ఎన్.అశ్వత్తనారాయణ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి, చర్చకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఆ సమయంలో స్పీకర్ యూ.టీ.ఖాదర్ ప్రతిరోజు వాయిదా తీర్మానం ఇస్తే ఎలా? బడ్జెట్ ప్రసంగంలో అవకాశముంది. ఈ విషయంపై రెండు మూడు సార్లు చర్చ కూడా జరిగింది. అందువల్ల నియమం 69కి మార్చి వచ్చేవారం చర్చకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో మాట్లాడిన అశ్వత్తనారాయణ, విశ్వవిద్యాలయాలను కాపాడాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను మూసివేసే ఆందోళన నిర్మాణమైందన్నారు. ఇందుకు ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, బీజేపీ సభ్యుడు బసనగౌడ పాటిల్ యత్నాళ్ జోక్యం చేసుకొని విశ్వవిద్యాలయాలను మూసివేయరాదని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలను మూతవేయనున్నట్లు ఇప్పటికే డీసీఎం డీ.కే.శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం సీఎం పరిశీలన చేస్తామని చెబుతున్నారా? ఇందులో వివాదం ఎదురైంది. అందువల్ల ఈ విషయంపై వివరణ ఇవ్వాలని అశోక్ డిమాండ్ చేశారు. ఈ సమయంలో సీఎం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను మూసివేయాలో లేదో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత తీర్మానం తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యేలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు
పరిషత్లో డీ.కే.శివకుమార్
ఆరోపణ
అప్పుడే జేపీ నేతలకు ఆందోళన ఎందుకు?
అసెంబ్లీలో ప్రశ్నించిన సీఎం సిద్దరామయ్య

వర్సిటీల మూసివేతపై తీర్మానం కాలేదు