
ప్రతిమకు పూలమాల వేసిన స్థానికులు
హొసపేటె: మానవ హక్కుల దినోత్సవంలో భాగంగా ఆదివారం కలెక్టరేట్ కార్యాలయ హాలులో జిల్లా పాలనాధికారి ప్రతిజ్ఞ చేశారు. కర్ణాటక రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు జిల్లాధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మానవ హక్కుల్ని కాపాడతామని తహసీల్దార్ మేఘా ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాధికారి కార్యాలయ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిజలింగప్ప జయంతి
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప 121వ జయంతిని ఆచరించారు. నిజలింగప్ప కాలనీలోని నిజలింగప్ప ప్రతిమకు సీనియర్ సిటిజన్ వీరనగౌడ పూలమాల వేసి ముఖ్యమంత్రిగా నిజలింగప్ప అందించిన సేవలను కొనియాడారు. ఈసందర్భంగా నారాయణరెడ్డి, సిద్దారెడ్డి, భీమరెడ్డి, అమరేగౌడలున్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న కార్యాలయ అధికారులు, సిబ్బంది