
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అతిథులు
కేజీఎఫ్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని జిల్లా సెషన్స్ జడ్జి గణపతి గురుసిద్ద బాదామి తెలిపారు. ఆదివారం నగరంలోని రోటరీ క్లబ్లో మాదక వస్తు రహిత కేజీఎఫ్ నిర్మాణానికి నిర్వహించిన 10కె మారథాన్లో ఆయన మాట్లాడారు. నిత్యం రాత్రి త్వరగా పడుకుని తెల్లవారగానే నిద్ర లేచి వ్యాయాయం చేయాలన్నారు. ప్రముఖంగా పౌష్టిక ఆహారాన్ని సేవించాలన్నారు. ఉదయం లేవగానే వాకింగ్, జాగింగ్ చేయడాన్ని పరిపాటిగా చేసుకోవాలన్నారు. ఉత్తమ జీవిత విధానాలను అలవర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవితం సాగించవచ్చన్నారు. సీనియర్ జడ్జి ముజఫర్ ఎ మాంజరి మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. ఒకసారి మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్లో వాటిని వీడడం చాలా కష్టకరం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాజగోపాలగౌడ, జడ్జిలు ఆర్ఎం నదాఫ్, ఆర్ మంజునాథ్, వినోద్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.