
అంకసముద్రకు వలస వచ్చిన వివిధ రకాల పక్షులు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని తుంగభద్ర నది తీరాన ఉన్న అంకసముద్రలో విదేశీ పక్షులు సందడి చేశాయి. ప్రస్తుతం చలికాలం ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి పక్షులు వలస రావడంతో అంకసముద్రం వివిధ రకాల పక్షులతో కనువిందు చేస్తోంది. సూర్యోదయానికి ముందు ఇక్కడ వాతావరణ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. సుమారు 244 ఎకరాల ప్రదేశంలో ఉన్న ఈ అంకసముద్రలో ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వలస రావడం అనవాయితీ. చలికాలం ముగింపు అనంతరం వేసవి ప్రారంభ సమయంలో ఇక్కడకు వచ్చిన వలస పక్షులు తిరిగి తమ సొంత గూటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం కోసం అన్వేషిస్తాయి. సూర్యాస్తమయం అనంతరం అంకసముద్రలో నివాసముంటాయి. నార్తర్న్ శెవలర్ గార్గేవి, ఉడ్శాండ్ పైషర్, కామన్ ప్యాండ్ పైపర్, పేంటెడ్ స్టార్క్, స్పాట్ బిల్డ్ డక్, పెలికాన్, గ్రే హెరాన్, నైట్ హెరాన్, క్యాటర్ ఈ గ్రేట్తో పాటు మొత్తం 150 పైగా రకాల వివిధ అందమైన అతిథి పక్షులు ఇక్కడకు వలస వచ్చాయి. ఇక్కడ ఉన్న పక్షులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి రావడంతో అంకసముద్ర పరిసరాలు పర్యాటకుల సందడితో కళకళలాడుతున్నాయి.
