బైక్‌ ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో ఒకరు మృతి

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

మృతుడు రాజు (ఫైల్‌)   - Sakshi

మృతుడు రాజు (ఫైల్‌)

మండ్య: మండ్య నగరంలోని స్వర్ణసంద్ర దగ్గర ఫైర్‌ స్టేషన్‌ ముందు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరెకి చెందిన రాజు (29) అనే యువకుడు మృతి చెందాడు. మండ్యలో పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళుతున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మండ్య నగర ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

జీపును ఢీకొన్న బస్సు, ఒకరు మృతి

బనశంకరి: కార్కళ పడుబిద్రి జాతీయ రహదారిలో ప్రైవేటు బస్‌, జీపు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ప్రైవేటు బస్‌, జీపును ఓవర్‌టేక్‌ చేసే సమయంలో అదుపుతప్పి జీప్‌ను ఢీకొనింది. జీపులోని ఒకరు మృతిచెందగా పలువురు గాయపడటంతో 108 అంబులెన్స్‌లో కార్కళ తాలూకా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement