
మరణించిన యువకులు
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో బైక్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. సింధనూరు తాలూకా ముద్దాపుర వద్ద మల్లాపురకు చెందిన హనుమంతప్ప(23), దేవరాజ్(24)లు మస్కి నుంచి సింధనూరుకు బైక్పై వెళుతుండగా ముద్దాపుర కేఈబీ వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సింధనూరు డీఎస్పీ తళవార్, సీఐ వీరారెడ్డి, దుర్గప్ప పరిశీలించి మృతదేహాలను పంచనామా కోసం సింధనూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.