రాజీ ప్రక్రియతో సమయం, డబ్బు ఆదా | - | Sakshi
Sakshi News home page

రాజీ ప్రక్రియతో సమయం, డబ్బు ఆదా

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు - Sakshi

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు

కోలారు: లోక్‌అదాలత్‌ల్లో రాజీ ప్రక్రియ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని న్యాయమూర్తి జీఏ మంజునాథ్‌ తెలిపారు. ఆదివారం నగరంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన 4వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిన్న చిన్న కేసులు కోర్టు వరకు రావడం వల్ల కోర్టు సమయం ఎంతో వృథా అవుతోంది. ఇలాంటి వాటిని రాజీ చేసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉందని, కోర్టు సమయం కూడా వృథా కాదన్నారు. ప్రస్తుతం సంవత్సరంలో నాలుగోసారి నిర్వహిస్తున్న లోక్‌అదాలత్‌లతో ఇంతవరకు 20 వేల కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రాజీ ప్రక్రియ ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలన్నారు. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సభ్య కార్యదర్శి సునీల్‌ ఎస్‌.హొసమని, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.మునేగౌడ, కార్యదర్శి భైరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement