
ప్రారంభిస్తున్న బీఆర్సీ అధికారి శివకుమార్
కంప్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయానికి కావాల్సిన నీటిపారుదల పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు డిమాండ్ చేశారు. తాలూకాలోని నందిపురలో మఠాధీశుల ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిపారుదల చింతన్ మంతన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. హగరిబొమ్మనహళ్లి తాలూకాలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నా నీటిపారుదల సౌకర్యం పొందలేక పోయారన్నారు. పక్కనే తుంగభద్ర నది ఉన్నా సద్వినియోగం కావడం లేదన్నారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సుపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు.
దివ్యాంగులకు
ఆత్మస్థైర్యమే బలం
హొసపేటె: దివ్యాంగులు ఆత్మసైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని విద్యా శాఖ బీఆర్సీ అధికారి శివకుమార్ తెలిపారు. ఆయన శనివారం బీఆర్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో మాట్లాడారు. తాలూకా వ్యాప్తంగా పాఠశాలల్లో సుమారు 500 మంది దివ్యాంగ పిల్లలు చదువుతున్నారన్నారు. దివ్యాంగ తల్లిదండ్రులు దివ్యాంగుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కోరారు. దివ్యాంగులను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్నారు. వనస్ఫూర్తి వికలచేతన సంఘం నేత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
భూ వసతి సౌకర్యానికి వినతి
కంప్లి: తాలూకాలోని నెల్లుడి గ్రామ పరిధిలో సర్వే నెం–133/బీ–1లోని 4.19 సెంట్ల ప్రభుత్వ భూమిలో వసతి సదుపాయం కల్పించాలని కర్ణాటక మాదిగ రక్షణా వేదిక, కర్ణాటక జనశక్తి, భూ వసతి పోరాట సమితి పదాధికారులు తహసీల్దార్ శివరాజ్కు శనివారం వినతిపత్రం అందించారు. అనంతరం మాదిగ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరియప్ప గుడిమని మాట్లాడుతూ తమ పోరాటం భూ, వసతి వంచితుల కోసమని, తగిన న్యాయం చేయాలని కోరారు.
లక్ష్మీవేంకటేశ్వరునికి
ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: నగరంలోని బెస్తవారిపేటలో వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరాలయంలో శనివారం రాత్రి మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా 24 దీపాలను వెలిగించి మహాలక్ష్మి, సరస్వతి, మహాదుర్గా దేవిలను ఆహ్వానించి షోడస, అష్టోత్తర నామంతో గాయత్రి జపంతో విశేష పూజలను నెరవేర్చినట్లు ఉప్పార సమాజం అధ్యక్షుడు ఈరణ్ణ తెలిపారు.
రక్తదానం చేసిన శునకం
● మరో కుక్కకు ప్రాణదానం
సాక్షి, బళ్లారి: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మనుషులే కాదు, శునకాలు కూడా కోరుకుంటున్నాయి. అదే మాదిరిగా ఓ శునకం రక్తదానం చేసి మరో శునకం ప్రాణాన్ని కాపాడింది. కర్ణాటకలో హావేరి జిల్లా ఉల్లత్తి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి చెందిన శునకానికి సుస్తీ చేస్తే పశువైద్యులకు చూపించాడు. శునకానికి రక్తహీనత ఉందని, తక్షనం రక్తం అవసరమని చెప్పారు. అదే గ్రూపు శునకం రక్తాన్ని తెప్పించి ఇస్తే చికిత్స చేస్తామని చెప్పారు. దీంతో నాగరాజు సోషల్ మీడియాలో తన కుక్క బాధను ఏకరువు పెట్టాడు. ఇది తెలుసుకొని బొమ్మనహాళ్ గ్రామానికి చెందిన రంజిత అనే మహిళ తన శుకనం రక్తాన్ని ఇచ్చేందుకు ఒప్పుకొని ఆ దిశగా స్థానిక హానగల్ తాలూకాలోని అక్కిఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క రక్తాన్ని దానం చేశారు.

దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి చంద్రును సన్మానిస్తున్న కమ్మరచేడుమఠం స్వామీజీ తదితరులు

మరో శునకానికి రక్తం అందిస్తున్న శునకం