భారీ ఏనుగుల మంద సంచారం | - | Sakshi
Sakshi News home page

భారీ ఏనుగుల మంద సంచారం

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

హనుమంతపురం వద్ద ఏనుగులు - Sakshi

హనుమంతపురం వద్ద ఏనుగులు

హోసూరు వార్తలు..

క్రిష్ణగిరి: హోసూరు సమీపంలోని హనుమతపురం అటవీ ప్రాంతంలో 70 ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బెంగళూరు బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి వందకు పైగా ఏనుగులు జవుళగిరి అటవీ ప్రాంతం మీదుగా డెంకణీకోట సమీపలోని నగనూరు, బేవనత్తం, ఉడేదుర్గం, శ్యానమావు అటవీ ప్రాంతాలకు చేరుకొన్నాయి. ఆదివారం ఉదయం 70 ఏనుగులు హనుమంతపురం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు కనిపించాయి. వెంటనే విషయాన్ని అటవీశాఖాధికార్లకు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నం చేపట్టారు. శ్యానమావు, ఆళియాలం, పోడూరు, రామాపురం తదితర చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement