కిడ్నాప్‌ కేసులో నలుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో నలుగురు అరెస్టు

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

- - Sakshi

హోసూరు: తీసుకొన్న అప్పును తీర్చలేకపోవడంతో కిడ్నాప్‌ చేసి బెదిరించిన నలుగురిని పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు పట్టణంలోని ఉప్కర్‌నగర్‌కు చెందిన మాదేష్‌ (54) కొన్నిరోజుల క్రితం బస్తీ ప్రాంతానికి చెందిన ప్రియ (30), సున్నపువీధికి చెందిన మంగళ (38) వద్ద లక్షల రూపాయలు రుణం తీసుకొన్నాడు. తీసుకొన్న డబ్బులు తిరిగి చెల్లించక ఆలస్యం చేశాడు. దీంతో శనివారం మాదేష్‌ను కిడ్నాప్‌ చేసి అప్పు కట్టాలని ఒత్తిడి చేశారు. వారి నుంచి తప్పించుకొన్న బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియ, ఆమె భర్త ఆనంద్‌, మంగళ ఆమె భర్త దాసప్పలను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

కార్మికుడు ఆత్మహత్య

క్రిష్ణగిరి: అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా నయం కాక కూలి కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన కావేరిపట్టణం వద్ద జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని గుండలంబట్టి గ్రామానికి చెందిన కూలికార్మికుడు పళణి (48) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. కానీ స్వస్థత కలగకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన పళణి శనివారం రాత్రి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

ఖాద్రీశునికి పోటెత్తిన భక్తులు

కదిరి టౌన్‌: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం స్వాతి నక్షత్రం కావడంతో స్వామివారి జన్మదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాతో పాటు చిత్తూరు, వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఖాద్రీశుని దర్శించుకున్నారు. మహిళలు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు.

అరెస్టయిన దంపతులు ప్రియ, ఆనంద్‌, మంగళ, దాసప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement