
సైంటిస్టు దశిక శ్రీనివాసరావ్ను సన్మానిస్తున్న దృశ్యం
గౌరిబిదనూరు: విద్యా సంస్థలు కేవలం విద్యా బోధనలవైపు మాత్రమే దృష్టి పెట్టకుండా సమాజానికి వారి సేవలను అందించాలని జిఎన్ఆర్ విద్యాసంస్థల అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి అన్నారు. జిఎన్ఆర్ పీయూ కళాశాల వార్షికోత్సవ సమావేశంలో వివిధ రంగాలలో సేవలందించిన వారిని సన్మానించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి, కష్టపడి చదవాలి. లక్ష్య సాధన మరవకూడదన్నారు. గురువుల పట్ల తల్లితండ్రుల పట్ల గౌరవభావంతో మెలగాలన్నారు. సన్మాన కీబోర్డ్ వాదకులు, విశ్రాంత బిఎఆర్సి విజ్ఞాని దశిక శ్రీనివాసరావ్ మాట్లాడుతూ... తాను ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడినని, 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ స్థానికుడిని అయ్యాయన్నారు. సంగీతంలో కర్ణాటక కళాశ్రీ గోపాలకృష్ణాచార్, రంగస్థల నటుడు నరసరాజును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్టీ పుష్ప, ప్రిన్సిపాల్ నాగరాజు, సంచాలకులైన ఫౌజియా ఫర్హత్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.