నగదు బదలాయించుకుని పరారీ | - | Sakshi
Sakshi News home page

నగదు బదలాయించుకుని పరారీ

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

- - Sakshi

హోసూరు: ద్విచక్ర వాహనం చెడిపోయిందని, మెకానిక్‌ షాపునకు గూగుల్‌పే చేయాలని నగదును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరారైన దొంగల కోసం బర్గూరు పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు... తిరుపత్తూరు జిల్లా వెలకల్‌నత్తం గ్రామానికి చెందిన మోహన్‌ (29) బర్గూరు సమీపంలోని ఒప్పదవాడి గ్రామంలో జిరాక్స్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం అక్కడికెళ్లిన ఇద్దరు వ్యక్తులు మోహన్‌ను కలిసి మార్గమధ్యలో ద్విచక్రవాహనం చెడిపోయిందని, వాహనాన్ని మెకానిక్‌షాప్‌లో వదిలామని, మెకానిక్‌కు రూ. 15 వేలు గూగుల్‌పే చేయాలని, తాము నగదుగా అందజేస్తామని కోరడంతో వారి మాటలు నమ్మిన మోహన్‌ నగదును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అనంతరం సమీపంలోని ఏటీఎంలో నగదు తీసుకొస్తామని చెప్పి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం

విజయపుర (బెంగళూరు గ్రామీణ): విజయపుర పట్టణం సమీపంలోని మండిబెలె పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా శివణ్ణ, ఉపాధ్యక్షుడిగా తమణ్ణ మాత్రమే నామినేషన్లు వేయడంతో వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు.

విజయపురలో వేరుశనగ పరుష ప్రారంభం

విజయపుర (బెంగళూరు గ్రామీణ): విజయపుర పట్టణంలోని శ్రీ బసవకళ్యాణ మఠం ఆవరణంలో సహాపరమపూజ్యులు నిరంజన ప్రసవస్వరూప డాక్టర్‌ మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా వేరుశనగ పరుష ప్రారంభమైంది. కార్యక్రమంలో బసవ కల్యాణ మఠానికి చెందిన జూనియర్‌ స్వామీజీ సదాశివ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement