విద్యాభ్యాసం కోసం కుమారుడిని దూరంగా ఉంచాను | - | Sakshi
Sakshi News home page

విద్యాభ్యాసం కోసం కుమారుడిని దూరంగా ఉంచాను

Dec 11 2023 12:42 AM | Updated on Dec 11 2023 12:42 AM

దొడ్డబళ్లాపురం: విద్యాభ్యాసం కోసం తన కుమారుడిని ఇన్ని రోజులు దూరంగా ఉంచడం జరిగిందని వేరే ఉద్దేశం లేదని వినోద్‌రాజ్‌ తెలిపారు. తన తల్లి లీలావతి తనను ఏ విధంగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో అదేవిధంగా తన భార్య తన కుమారుడికి మంచి చదువు చెప్పించి తీర్చి దిద్దిందని ప్రస్తుతం తన కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడని వినోద్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. తన కుమారుడు చైన్నెలో ఉన్నప్పటికీ కన్నడ బాగా మాట్లాడతాడన్నారు. దేవాలయాలు దర్శించుకోవాలని తన తల్లికి కోరిక ఉండేదన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని, ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇవన్నీ జరగాలంటే సమయం పడుతుందన్నారు. యువరాజ్‌ ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటుండడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

లీలావతి మూడవరోజు కార్యం

కన్నడ సీనియర్‌ నటి లీలావతి మృతి చెందిన నేపథ్యంలో ముడవ రోజు కార్యాన్ని కుమారుడు వినోద్‌రాజ్‌ నెరవేర్చారు. నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలోని ఆమె ఫాంహౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో లీలావతి అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఆదివారం వినోద్‌రాజ్‌, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో మూడవరోజు కార్యాన్ని సమాధికి పూజ చేసి పాలు, నెయ్యి పోసి పూర్తి చేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement