ఈబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని దీక్ష | - | Sakshi
Sakshi News home page

ఈబీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని దీక్ష

Dec 11 2023 12:40 AM | Updated on Dec 11 2023 12:40 AM

ఉపవాస దీక్షలో పాల్గొన్న స్వామీజీలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తదితర ప్రముఖులు  - Sakshi

ఉపవాస దీక్షలో పాల్గొన్న స్వామీజీలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తదితర ప్రముఖులు

గంగావతి: అన్ని సమాజాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఆర్‌ శ్రీనాథ్‌ పేర్కొన్నారు. ఆయన బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద ఈడిగ సమాజం వారు ఇతర సమాజాల వారిని కలుపుకొని ఈడిగ సమాజ గురువు ప్రణవానంద స్వామి నేతృత్వంలో చేపట్టిన ఉపవాస సత్యాగ్రహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. బ్రాహ్మణ సమాజం మొదలుకొని అన్ని సమాజాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారన్నారు. వారికి ప్రభుత్వం సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి సమాజానికి ఏర్పాటైన మండలికి రూ.500 కోట్ల నిధులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈడిగ సమాజం మరో రాష్ట్ర నేత మంచేగౌడ మాట్లాడుతూ గోశాస్త్ర అధ్యయనానికి రూ.25 లక్షలను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తమ సమాజ సమస్యల సాధన కోసం అందరూ కలిసికట్టుగా, ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగభూషణ శివాచార్య స్వామీజీ, మాజీ ఎమ్మెల్యేలు పరణ్ణ మునవళ్లి, కెసరట్టి వీరప్ప, మాజీ ఎంపీ సూగూరు శివరామగౌడ, రైతు ప్రశస్తి విజేత జీ.శ్రీధర్‌, కేఆర్‌పీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌గౌడ హేరూరు, ఆ పార్టీ మరో నేత సయ్యద్‌ అలీ, నాయక్‌ సమాజ ప్రముఖులు వీరభద్రప్ప నాయక్‌, హనుమంతప్ప నాయక్‌, లమాణి సమాజ ప్రముఖులు రామనాయక్‌, కసాప మాజీ అధ్యక్షులు సీహెచ్‌ నారినాళ్‌, దళిత సంఘం నేత అంబణ్ణ, గంగామత ప్రముఖులు రాజశేఖర్‌ ముస్టూరు, ఇతర పలు సమాజాల ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ప్రణవానంద స్వామి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస సత్యాగ్రహాన్ని కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement