
హోరాహోరీగా ఆడుతున్న బాలికలు
హొసపేటె: నగరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ప్రీ–గ్రాడ్యుయేషన్ కళాశాల విద్యార్థుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్లో దక్షిణ కన్నడ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడబిడ్రె అళ్వాస్ ప్రీ గ్రాడ్యుయేషన్ కళాశాల బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. పోటాపోటీగా జరిగిన బాలికల సెమీ ఫైనల్లో దక్షిణ కన్నడ జిల్లా జట్టు 2–0 సెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల బాలికల జట్లు హోరాహోరీగా తలపడగా, ఎట్టకేలకు దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన మూడబిద్రె ఆళ్వాస్ ప్రీ గ్రాడ్యుయేషన్ కళాశాల జట్టు కెప్టెన్ సావిత్రి రమేష్ నేతృత్వంలో హోరాహోరీగా పోటీనిచ్చి రాష్ట్ర స్థాయి బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదే విధంగా బాలుర విభాగంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కన్నడ జిల్లా చిక్కమగళూరు జిల్లా జట్టుపై 2–0 సెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణ కన్నడ జిల్లా ఆళ్వాస్ ప్రీ గ్రాడ్యుయేషన్ కళాశాల టీమ్ లీడర్ ఎస్.చరణ్ చిక్కమగళూరు జిల్లా జట్టుకు గట్టి పోటీనిచ్చారు.

ఉత్సాహంగా తలపడుతున్న బాలురు

బాలికల విజేత జట్టుకు ట్రోఫీని అందిస్తున్న దృశ్యం

ఫైనల్లో గెలిచిన తర్వాత ట్రోఫీతో బాలుర జట్టు